Breaking News

బీహార్‌ కుర్రాడిని తెగ పొడిగిన ప్రధాని మోదీ..


Published on: 05 May 2025 12:38  IST

ఐపీఎల్‌ 2025లో ఇటీవల 35 బంతుల్లో సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అతని బ్యాటింగ్ తీరు గురించి ఇప్పటికే అనేక మంది మెచ్చుకోగా, తాజాగా ప్రధాని మోదీ కూడా అతని గురించి ప్రశంసించడం విశేషం. బీహార్‌ పాటలీపుత్ర స్టేడియంలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ప్రారంభ వేడుక సందర్భంగా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూశానని మోదీ అన్నారు. ఐపీఎల్‌లో బీహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు. వైభవ్ చిన్న వయసులోనే పెద్ద రికార్డు సృష్టించాడని కొనియాడారు.

Follow us on , &

ఇవీ చదవండి