Breaking News

22 మంది మావోయిస్టులు మృతి


Published on: 07 May 2025 12:19  IST

ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలంలో కాల్పులు కొనసాగుతున్నాయి.ఈ ఆపరేషన్‌ను డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్‌, ఎస్టీఎఫ్, బస్తర్‌ ఫైటర్స్, సీఏఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీన్ని ఏడీజీ వివేకానంద సిన్హా పర్యవేక్షిస్తున్నారు.మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి