Breaking News

సోషల్‌ మీడియాలో పాక్‌ ‘ఫేక్‌ న్యూస్‌’..


Published on: 07 May 2025 13:45  IST

ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత భారత సైన్యానికి చెందిన రెండు స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్‌ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ చేసి పాక్‌ నీచ బుద్ధిని బయటపెట్టింది. ‘‘పాక్‌ సైన్యం సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీదే.ఆ వీడియోలన్నీ పాతవి. భారత్‌కు చెందినవి కూడా కాదు. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండండి’’ అని కేంద్రం భారత పౌరులకు సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి