Breaking News

పాక్ 3 ఫైటర్‌ జెట్లసహా అన్నింటినీ చిత్తుచేసిన భారత్


Published on: 09 May 2025 11:31  IST

భారత ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేసినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు  భారత ఆర్మీ ట్వీట్ చేసింది.  భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్‌ దాడులకు దిగినట్లు తెలిపింది. డ్రోన్లు, ఇతర పరికరాలతో పాక్ దాడులకు దిగినట్లు ఆర్మీ ట్వీట్ చేసింది. పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడుతోందని పేర్కొంది. దేశ సార్వభౌమత్వం పరిరక్షణకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి