Breaking News

పరకామణి కేసు.. హైకోర్టుకు సీఐడీ మరో నివేదిక


Published on: 09 Dec 2025 16:12  IST

తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మరో నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను వేసింది. అదనపు నివేదికను మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది.అదనపు నివేదికను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు తదుపరి విచారణను రేపటి (బుధవారం) హైకోర్టు వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement