Breaking News

తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి


Published on: 10 May 2025 10:17  IST

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలైన హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌ల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఢిల్లీ, చండీగఢ్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని కోరుతూ రైల్వే మంత్రికి శుక్రవారం రాసిన లేఖలో ఎంపీ కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి