Breaking News

పాక్‌స్థాన్‌కు భారత్ సీరియస్ వార్నింగ్


Published on: 10 May 2025 17:37  IST

పాకిస్తాన్‌కు భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. పాకిస్థాన్ రెచ్చిపోతే అంతకు అంత ప్రతిదాడితో విరుచుకుపడాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన త్రివిధ దళాధిపతులతో జరిపిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాక్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి