Breaking News

అటవీశాఖ అధికారులపై గ్రామస్థులు దాడి

నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట వద్ద అటవీశాఖ అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటన నవంబర్ 12, 2025 సాయంత్రం చోటుచేసుకుంది.


Published on: 12 Nov 2025 18:51  IST

నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట వద్ద అటవీశాఖ అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటన నవంబర్ 12, 2025 సాయంత్రం చోటుచేసుకుంది. గువ్వలగుట్ట సమీపంలోని అటవీ భూములను గ్రామస్థులు దున్నుకుంటున్నారనే సమాచారంతో అటవీ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.పట్టా కాగితాలు చూపించి భూమిని సాగు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్థులు అటవీ అధికారులు మరియు సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో ఆరుగురు అటవీ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి