Breaking News

ఆదిలాబాద్లో విద్యుదాఘాతానికి వివాహిత మృతి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెళ్లి ఇంట్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరబెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రేఖ (20) అనే వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది.


Published on: 26 Jun 2026 15:32  IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెళ్లి ఇంట్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరబెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రేఖ (20) అనే వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలం, బొరిగాం గ్రామం.మృతురాలిని రేఖ (20) గా గుర్తించారు. మూడు నెలల క్రితమే ఈమెకు చింటూ అనే యువకుడితో వివాహం జరిగింది.డాబాపై ఉన్న తీగపై బట్టలు ఆరబెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది.

పెళ్లి ఇంట్లో కన్నీరు

రేఖ అడపడుచు (భర్త సోదరి) వివాహం గురువారం (జూన్ 25, 2026) ఘనంగా జరిగింది.పెళ్లి జరిగిన మరుసటి రోజే (జూన్ 26, 2026) ఇంటి కోడలు రేఖ కరెంట్ షాక్‌తో మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది.పెళ్లి వేడుకలతో కోలాహలంగా ఉండాల్సిన ఇల్లు, రేఖ అకాల మరణంతో కన్నీరు మున్నీరుగా మారింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం అందుకుని దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంది.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement