Breaking News

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం


Published on: 01 Jul 2025 14:22  IST

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఇవాళ(మంగళవారం) వైభవంగా నిర్వహించనున్నారు. అమ్మవారి కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో వచ్చే మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి వార్షిక కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణం కోసం ఆలయాన్ని నిర్వాహకులు సుందరంగా ముస్తాబు చేశారు. ఇవాళ ఉదయం 5 గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్‌లు, వీఐపీ ఎంట్రీ కోసం క్యూ లైన్ ఏర్పాటు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి