Breaking News

విజయవాడ రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు


Published on: 09 May 2025 09:48  IST

భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి భద్రతా వ్యవస్థను పరీక్షించేందుకు మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. జీఆర్‌పీ, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో 5 బృందాలు డాగ్‌ స్క్వాడ్‌తో కలిసి స్టేషన్‌లో సమగ్ర తనిఖీలు చేపట్టాయి. ప్లాట్‌ఫాంలు, టికెట్‌ కౌంటర్లు, పార్శిల్‌ కేంద్రం వరకు బ్యాగుల సోదాలు జరిపారు. అనుమానితుల వివరాలు నమోదు చేయడంతో పాటు సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించి ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి