Breaking News

సైబర్‌ మోసాలు అరికట్టేలా చట్టాల్లో మార్పులు


Published on: 18 Jul 2025 14:59  IST

సైబర్ క్రైమ్, సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టే అంశాలపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో పిటిషన్ కమిటీ ఈరోజు (శుక్రవారం) సమావేశమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టేందుకు పటిష్టమైన చట్టాలు అవసరమన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని మరింత పదను పెట్టేలా మార్పులు చేర్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి