Breaking News

మౌలానా ఆజాద్‌కి నివాళి అర్పించిన చంద్రబాబు


Published on: 11 Nov 2025 12:16  IST

స్వాతంత్య్ర సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కి నివాళి అర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ట్వీట్ పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి