Breaking News

వారి రక్షణ బాధ్యత మాదే: మంత్రి అనిత


Published on: 13 Nov 2025 15:06  IST

విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. దాదాపు 3500 మంది పోలీసులతో పటిష్ట భద్రత చేపట్టామన్నారు. సదస్సుకు వచ్చే ప్రతీ వీఐపీ విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి తిరిగి వారి గమ్యస్థానానికి చేరే వరకూ రక్షణ బాధ్యత తామే తీసుకున్నామన్నారు. భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా రాజీపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి