Breaking News

ఢిల్లీలో మరోసారి పేలుడు శబ్దం..


Published on: 13 Nov 2025 16:35  IST

ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఈ క్రమంలో ఎలాంటి పేలుడు శబ్దం వినిపించినా ఉలిక్కిపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో గురువారం ఉదయం మహిపాల్‌పూర్‌ ప్రాంతంలో రాడిసన్‌ హోటల్‌ సమీపంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అయితే, అది పేలుడు కాదని అధికారులు తేల్చారు. ఆ శబ్దం బస్సు టైర్‌ పేలడం వల్ల వచ్చిందిగా తేల్చారు.

Follow us on , &

ఇవీ చదవండి