Breaking News

శ్రేయస్‌ అయ్యర్‌ పునరాగమనం మరింత ఆలస్యం!


Published on: 31 Dec 2025 12:20  IST

టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి అతడికి ఇంకా అనుమతి లభించలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచులో గాయపడిన శ్రేయస్‌.. ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు. అయితే టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది. ఈ జట్టులోకి అయ్యర్‌ను తీసుకోనున్నారనే వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నింటికీ చెక్ పడినట్లు అయింది.

Follow us on , &

ఇవీ చదవండి