Breaking News

పట్టుదలతో ముందుకు సాగాలి..


Published on: 02 Jan 2026 15:45  IST

నూతన సంవత్సరంలో దేశ ప్రజలు దృఢచిత్తం, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో తమ లక్ష్యాలను చేరుకోవాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. ప్రజలు నూతన ఏడాదిలో చేసుకున్న తీర్మానాలకు అనుగుణంగా ఆత్మశక్తితో ముందుకు సాగాలని తెలిపారు. ఈ సందర్భంగా సంస్కృత శ్లోకాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు. స్థిర చిత్తం, లక్ష్యంపై స్పష్టతే విజయానికి పునాదులు అని అన్నారు

Follow us on , &

ఇవీ చదవండి