Breaking News

శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ


Published on: 02 Jan 2026 16:45  IST

శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్  కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్ఓబీ పనులపై ఎవరూ అపోహలకు గురి కావద్దని అన్నారు. సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. ఇవాళ(శుక్రవారం) గుంటూరు జిల్లాలో పెమ్మసాని పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శంకర్ విలాస్ ఆర్ఓబీని చెప్పిన సమయానికే పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. 2027 జూలైలోపే ఈ ఆర్ఓబీని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి