Breaking News

ఈబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయండి..


Published on: 12 Jan 2026 15:53  IST

తెలంగాణలో ఈబీసీ కమిషన్‌ను, ఈబీసీల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డిని ఈబీసీ సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎంకు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి చేపడుతు న్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను అగ్రవర్ణ పేద కుటుంబాలకు వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈబీసీ విద్యార్థులకు స్టడీ సర్కిళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి