Breaking News

మద్యం మత్తులో.. రౌడీషీటర్ల బీభత్సం


Published on: 12 Jan 2026 17:06  IST

భవానీపురం: అసలే కరుడుగట్టిన రౌడీషీటర్లు.. ఆపై మద్యం మత్తులో తూగుతున్నారు.. దీనికి తోడు కారు ఎక్కి నానా బీభత్సం సృష్టించారు. నగరంలో రౌడీషీటర్లు మరోసారి రెచ్చిపోయారు. మద్యం మత్తులో బబ్బూరి గ్రౌండ్స్‌ వద్ద కారును నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపి బీభత్సం సృష్టించారు. నలుగురి పైకి కారును ఎక్కించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రౌడీషీటర్లను వెంటాడి పోలీసులు గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి