Breaking News

పోలీసు వాహనాన్ని లక్ష్యంగా భారీ బాంబ్ బ్లాస్ట్..


Published on: 14 Jan 2026 18:54  IST

నార్త్ వెస్టర్న్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) సంస్థ దాడులకు తెగబడింది. టీటీపీ జరిపిన దాడుల్లో ఏడుగురు సాయుధ పోలీసులు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో స్థానిక పోలీస్ చీఫ్ ఇషాక్ అహ్మద్ ఉన్నట్లు సమాచారం. టాంక్ జిల్లాలోని గోమల్ మార్కెట్ వద్ద పోలీసులు ప్రయాణిస్తున్న కారును టీటీపీ రిమోట్ కంట్రోల్‌తో పేల్చినట్లు సమాచారం.పేలుడు దృశ్యాలకు సంబంధించిన ఫుటేజ్‌ని బుధవారం ఆ సంస్థ రిలీజ్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి