Breaking News

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు..


Published on: 19 Jan 2026 18:51  IST

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది.ఈ కేసులో రాష్ట్ర బీజేపీ సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వం లోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్‌ను కూడా జత చేసిన ధర్మాసనం..తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి