Breaking News

ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి


Published on: 05 Jun 2025 18:02  IST

ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారు. ఆత్మకూరు మండలం ఏఎస్‌ పేట అడ్డరోడ్డు వద్ద వేగంగా వచ్చిన కారు, వెంకటరావుపల్లి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్‌కు వెళ్తున్న కూలీలు ఆటో ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మరో ఏడుగురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్త పరిచారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి