Breaking News

సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో జగన్‌కు రిలీఫ్


Published on: 01 Jul 2025 15:40  IST

సింగయ్య మృతి ఘటనలో వైసీపీ అధినేత జగన్, ఇతరులపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు రెండు వారాల పాటు స్టే విధించింది. ఈ కేసులో రెండు వారాల పాటు తదనంతర చర్యలు తీసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. తమ వద్ద ఉన్న వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలు కోర్ట్ ముందు ఉంచేందుకు రెండు వారాలు సమయం కావాలని కోర్టును అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి