Breaking News

కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యం


Published on: 01 Jul 2025 18:51  IST

మతిస్థిమితం లేని మహిళ అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ తల్లోజు జోత్స్న, ఎస్ఐ డి.సుభాష్ వివరాల ప్రకారం.. గోల్నాక చర్చిలైన్‌లోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన గోపాలదాసు భార్య ప్రభావతి(55)గత కొంతకాలంగా ఈమెకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఆదివారం కూతురు డ్యూటీకి వెళ్లింది. అనంతరం ప్రభావతి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు. పోలీస్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి