Breaking News

భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి


Published on: 29 Apr 2025 14:28  IST

తిరుపతి సమీపంలో తుడా క్వార్టర్స్‌లోని హెచ్‌ఐజీ విభాగంలో ప్లాట్‌ నంబర్‌ 63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బొటోతొట్టి శ్రీనివాసులు, ఒంగోలుకు చెందిన వసంత్‌, కె.శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ చేస్తున్నారు. ఐదో అంతస్తులో పని జరుగుతున్న సమయంలో మేరవ కర్రలు ఊడిపోయాయి. ఈ క్రమంలో మాధవ తప్పించుకోగా మిగిలిన ముగ్గురూ పైనుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి