Breaking News

ఇస్లామాబాద్, లాహోర్‌లో నో-ఫ్లై జోన్ ప్రకటించిన పాక్


Published on: 30 Apr 2025 16:21  IST

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి గట్టి జవాబిస్తామంటూ భారత్ విస్పష్టంగా ప్రకటించడంతో ఇస్లామాబాద్, లాహోర్ ఎయిర్‌స్పేస్‌లో నో-ఫ్లై జోన్‌ ఈ NOTAM నోటీసును పాక్ జారీ చేసింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో మిలటరీ దాడులకు భారత్ వ్యూహరచన చేస్తున్నట్టు ఇంజెలిజెన్స్ సమాచారం తమ వద్ద ఉందని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లాహ్ తరార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి