Breaking News

తెలంగాణలో దుర్మార్గమైన పాలన..


Published on: 31 Oct 2025 17:39  IST

తెలంగాణ రాష్ట్రమంతా మొంథా తుఫాన్‌తో అల్లకల్లోలం అవుతోందని.. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏం చర్యలు చేపట్టారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మొంథా తుఫాన్‌‌ చర్యలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏప్రిల్, మేలో కూడా అకాల వర్షాలు కురిశాయని.. ఆ సమయంలో పంట నష్టం జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి రూ. 10 వేలు పరిహారం ఇస్తామని చెప్పారని.. ఇంకా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

Follow us on , &

ఇవీ చదవండి