Breaking News

అమృత్‌సర్‌లో హైఅలర్ట్‌


Published on: 08 May 2025 15:02  IST

పంజాబ్‌ అమృత్‌సర్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. అమృత్‌సర్‌ పరిసరాల్లో మిస్సైల్‌ శకలాలు లభ్యం కావటం ఇప్పుడు కలకలం రేపుతోది. అమృత్‌సర్‌పై మిస్సైల్‌ దాడికి పాక్‌ ప్రయత్నించినట్టుగా సమాచారం. కానీ, భారత బలగాలు పాక్‌ చర్యలను తిప్పికొట్టాయి. పాక్‌ ప్రయోగించిన మిస్సైల్‌ను గాల్లోనే ధ్వంసం చేసింది భారతసైన్యం. యాంటీ మిస్సైల్‌ వ్యవస్థ ద్వారా పాక్‌ దుశ్చార్యను భారత్‌ అడ్డుకుంది. ఈ క్రమంలోనే అమృత్‌సర్‌ పరిసరాల్లో కూలిపడిపోయిన మిస్సైల్‌ శకలాలను గుర్తించారు స్థానికులు.

Follow us on , &

ఇవీ చదవండి