Breaking News

ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరికలు


Published on: 09 May 2025 10:08  IST

సరిహద్దు ప్రాంతాల్లో దాడుల ముప్పుతో పంజాబ్‌ చండీగఢ్‌లో శుక్రవారం ఉదయం ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి కూడా రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో జమ్మూలో ఉదయం 4.15కు పేలుడు శబ్దాలు వినిపించడంతో నగరాన్ని బ్లాక్‌అవుట్‌ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య భద్రతా చర్యలు ముమ్మరం అయ్యాయి.సరిహద్దు జిల్లాల్లో పాక్‌ నుంచి వస్తోన్న డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా కూల్చేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి