Breaking News

అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..


Published on: 19 Jan 2026 10:45  IST

నాగోబా జాతర.. ఆసియాలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గాంచింది. పుష్యమాసంలో నెలవంక కనిపించిన అనంతరం మెస్రం వంశీయులు.. ఈ నాగోబా జాతరకు శ్రీకారం చుడతారు. డిసెంబర్ 30న మెస్రం వంశీయులు కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా హస్తినమడుగుకు చేరుకొని.. అక్కడ సేకరించిన పవిత్ర గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్నారు. ఆ గంగాజలంతో ఆదివారం అర్ధరాత్రి ఆదిశేషుడికి అభిషేకం చేసి మహాపూజలు నిర్వహించడం ద్వారా ఈ జాతరను ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి