Breaking News

ఉప్పాడ తీరంలో అలల ఉధృతి


Published on: 04 Dec 2025 12:20  IST

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో ఉప్పాడ సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటోంది. దీంతో తీర ప్రాంతం కోతకు గురవుతోంది. మంగళ, బుధవారాల్లో సముద్రంలో ఏర్పడిన పోటు, పాట్లకు ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటాల ధాటికి కోనపాపపేట తీ రంలో మత్స్యకారుల తాటాకుపాక దెబ్బతినగా మరోపక్కా ఇంటిశ్లాబు నేలకొరిగింది. కోనపాపపేట గ్రామానికి సముద్రం రెండు, మూడు ఫర్లాంగుల దూరంలో ఉండేది. కానీ, ఇటీవల కాలంలో అతి దగ్గరగా చేరుకోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి