Breaking News

హైదరాబాద్‌లో పోలీస్‌ నిఘా


Published on: 10 May 2025 09:24  IST

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న బీకర దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రోజురోజుకూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సౌత్‌ జోన్‌, సౌత్‌ వెస్ట్‌, సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఇప్పటికే రౌడీషీటర్లు, అల్లరిమూకలు, అరాచక శక్తులకు సిటీ పోలీసులు తీవ్రంగా హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి