Breaking News

పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్..


Published on: 10 May 2025 11:23  IST

ఆపరేషన్ సిందూర్‌ దెబ్బ పాకిస్తాన్‌కు గట్టిగానే తగులుతోంది. భారత్ వరుస దాడులతో బిత్తరపోతున్న పాకిస్తాన్‌కు తాజాగా మరో సంక్షోభం ఎదురైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు పెట్రోల్‌ బంక్‌లు మూసేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయిన ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజాగా, పెట్రోల్ బంకుల మూసివేత నిర్ణయంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి