Breaking News

రైల్వేస్టేషన్లలో భద్రత మరింత కట్టుదిట్టం: ద.మ.రైల్వే


Published on: 10 May 2025 16:19  IST

భారత్ - పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ వెల్లడించారు. నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లైన సికింద్రాబాద్‌, కాచిగూడలో భారీగా భద్రతను పెంచినట్లు తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్యను సైతం పెంచి పర్యవేక్షణ చేస్తున్నట్లు శ్రీధర్ పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను మూసి వేయడంతో రైల్వేస్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి