Breaking News

పీవోకేను అప్పగించడంపై తప్ప వేరే చర్చల్లేవ్‌: భారత్‌


Published on: 11 May 2025 18:27  IST

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) భారత్‌కు తిరిగి రావడమే మిగిలిన అంశమని కేంద్రం స్పష్టం చేసింది. మే 7న పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన తర్వాత పాక్‌ డీజీఎంవోకు సమాచారం ఇచ్చామని, చర్చలకు సిద్ధమని తెలిపినప్పటికీ పాక్‌ నుంచి స్పందన లేదని వెల్లడించింది. రహిమ్యార్‌ఖాన్‌ వైమానిక స్థావరం, బహావల్‌పూర్‌, మురుద్కే, ముజఫర్‌బాద్‌లోని ఉగ్రవాద కేంద్రాలను భారత దళాలు ధ్వంసం చేశాయని పేర్కొంది. “బుల్లెట్లు పంపితే... బాంబులు పంపే స్థాయికి భారత్‌ ఎదిగింది” అని ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి.

Follow us on , &

ఇవీ చదవండి