Breaking News

పార్కును కాపాడిన హైడ్రా..


Published on: 30 Dec 2025 11:59  IST

శేరిలింగంపల్లి మండలం, మదీనగూడ విలేజ్‌లో పార్కును హైడ్రా(HYDRAA) కాపాడింది. దీని విలువ రూ. 13 కోట్లు ఉంటుంది. సర్వే నంబరు 23లో ఉషోదయ ఎన్‌క్లేవ్‌ పేరిట హుడా అనుమతి పొందిన లేఅవుట్‌ ఉంది. ఇందులో 1000 గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ(GHMC)కి గిఫ్ట్‌డీడ్‌ కూడా చేశారు. పార్కు స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. పార్కు స్థలాన్ని కాపాడాలని ఉషోదయ ఎన్‌క్లేవ్‌ నివాసితుల పోరాటం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి