Breaking News

పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు..


Published on: 30 Dec 2025 16:07  IST

ముంబై మహానగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భాండుప్ ఏరియాలో సోమవారం రాత్రి పాదచారులపైకి బెస్ట్ బస్సు దూసుకెళ్లడంతో.నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.నిత్యం రద్దీగా ఉండే భాండుప్ స్టేషన్ రోడ్ సమీపంలో సోమవారం రాత్రి బస్సు రివర్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం, సాంకేతిక లోపం కారణంగానే బస్సు హఠాత్తుగా పాదచారులను బలంగా ఢీకొట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి