Breaking News

సింహాచలం ఘటనపై స్పందించిన నరేంద్రమోదీ


Published on: 30 Apr 2025 11:41  IST

ఆంధ్రప్రదేశ్‌,  విశాఖపట్నం, సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి