Breaking News

కసిరెడ్డికి సుప్రీంలో దక్కని ఊరట


Published on: 23 May 2025 15:08  IST

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కసిరెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తన కొడుకు అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించడం లేదంటూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి