Breaking News

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా


Published on: 29 May 2025 11:16  IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ సిందూర్ తరువాత మొదటిసారి ఆయన గురువారం జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు జమ్మూ, పూంచ్‌లో పర్యటించనున్నారు. అమిత్ షా రెండు రోజుల పర్యటనలో జాతీయ భద్రత, సరిహద్దుల్లో పరిస్థితులపై స్థానిక పోలీస్ యంత్రాంగం, భద్రతాదళాలతో సమీక్షించనున్నారు. జూలైలో ప్రారంభంకానున్న అమర్‌నాథ్ యాత్రకు భద్రతా సన్నద్థతను అమిత్ షా సమీక్షించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి