Breaking News

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు


Published on: 29 May 2025 15:07  IST

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌‌పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలు భారత్‌లో విలీనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అతి త్వరలో POKను స్వాధీనం చేసుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని రాజ్‌నాథ్‌సింగ్‌ పునరుద్ఘాటించారు.CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) వార్షిక వ్యాపార సదస్సు-2025 ప్రారంభోత్సవంలో రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి