Breaking News

బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు


Published on: 03 Jun 2025 13:44  IST

డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత రెడ్యానాయక్‌పై పోలీసులు ఇవాళ(మంగళవారం) కేసు నమోదు చేశారు. రెడ్యానాయక్‌తో సహా 17 మందిపై కేసులు పెట్టారు. సోమవారం నాడు డోర్నకల్ పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ర్యాలీ నిర్వహించారు. దీంతో డోర్నకల్‌లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలోనే పోలీసులు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో డోర్నకల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి