Breaking News

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున


Published on: 03 Jun 2025 15:59  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్‌ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అనంతరం ఆయనతో కాసేపు ముచ్చటించారు.గతేడాది నవంబర్‌లో అఖిల్‌ నిశ్చితార్థం జైనబ్‌ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కినేని అభిమానులు వీరి పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు అనేది వెల్లడించలేదు కానీ జూన్‌ 6న వీరి పెళ్లి జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి