Breaking News

అమెరికా జోక్యం కోసం కాదు: ఎంపీ శశిథరూర్


Published on: 05 Jun 2025 11:25  IST

మా తలలపై తుపాకీలు గురి పెట్టిన వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ శశి థరూర్ కుండ బద్దలు కొట్టారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోన్నంత కాలం పాకిస్థాన్‌తో చర్చలు జరపబోమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న ఎంపీ శశిథరూర్ బుధవారం నేషనల్ ప్రెస్ క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. తమ పర్యటన కేవలం ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ వ్యవహార శైలిపై అవగాహన కల్పించడం కోసమేనని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి