Breaking News

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ మృతి


Published on: 05 Jun 2025 15:51  IST

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ (65) అలియాస్‌ సింహాచలం, గౌతమ్‌ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జాతీయ పార్క్‌ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్టు సమాచారం. సుధాకర్‌ అసలు పేరు తెంటు లక్ష్మీనరసింహాచలం. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్‌పై రూ.50 లక్షల రివార్డు ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి