Breaking News

బ్రాండెడ్ బ్యాగుల్లోకి రేషన్ బియ్యం..


Published on: 25 Jun 2025 09:59  IST

బ్రాండెడ్ కంపెనీ బ్యాగుల్లో రేషన్ బియ్యం నింపి అమ్ముతున్న వ్యాపారులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ ఏరియాలో ఉన్న రజిత కిరాణా, ఆంధ్ర కిరాణా షాపుల్లో తనిఖీలు చేపట్టారు. రెండు దుకాణాల్లో 79 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. బ్రాండెడ్ పేర్లతో ఉన్న సంచుల్లో రేషన్ బియ్యాన్ని నింపి, అధిక ధరలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.

Follow us on , &

ఇవీ చదవండి