Breaking News

భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం


Published on: 25 Jun 2025 10:02  IST

దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలోని ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.అగ్నిమాపక సిబ్బంది 16 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి