Breaking News

విజయనగరం ఉగ్ర లింకుల కేసు.. రంగంలోకి ఎన్‌ఐఏ


Published on: 28 Jun 2025 11:45  IST

విజయనగరం ఉగ్ర లింకుల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ‌కు బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారనే ఆరోపణలతో గత నెల 16న విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌లను విజయనగరం టూ టౌట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇరువురు నిందితులు విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. లోతైన దర్యాప్తు కోసం ఎన్‌ఐఏకు అప్పగించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి