Breaking News

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఆస్ప‌త్రిలో దారుణ మ‌ర్డ‌ర్‌..!


Published on: 01 Jul 2025 16:26  IST

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని నార్సింగ్‌పూర్ ఆస్ప‌త్రిలో దారుణ‌మైన మ‌ర్డ‌ర్ జ‌రిగింది. ప‌ట్ట‌ప‌గ‌లే ఓ అమ్మాయిని గొంతు కోసి చంపేశాడు. ఈ ఘ‌ట‌న జూన్ 27వ తేదీన ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో జ‌రిగింది. మృతురాలు 19 ఏళ్ల సంధ్యా చౌద‌రీ. ఆమె 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ది. అభిషేక్ కోస్తి అనే వ్య‌క్తి ఆమెను హ‌త్య‌ చేశాడు. అమ్మాయి గొంతు కోస్తున్న వీడియో ఒక‌టి సోమ‌వారం వైర‌ల్ అయ్యింది. విద్యార్థినిపై దాడి చేస్తున్న స‌మ‌యంలో ఆస్ప‌త్రి సిబ్బంది, పేషెంట్లు అక్క‌డే ఉన్నా..వారేమీ అడ్డుకోలేక‌పోయారు. ఆస్ప‌త్రి ఫ్లోర్‌పైనే ర‌క్త స్త్రావం జ‌రిగి ఆమె ప్రాణాలు విడించింది.

Follow us on , &

ఇవీ చదవండి